Home » Parliament Budget Session
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పైన పవర్ఫుల్ పంచ్లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై నిప్పులు కక్కారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలపై పవర్ఫుల్ పంచ్ విసిరారు. ''దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించాల్సిందే'' అని హెచ్చరించారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు.
PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రసంగంలో మోదీ ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం గమనార్హం.