Home » Phone tapping
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అరెస్టు చేయగా దాదాపు 10 నెలలుగా జైలులోనే తిరుపతన్న ఉన్నారు.
Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా గవర్నర్ ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణరావు ఇద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించనున్నారు.
Harish Rao: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్వాష్ పిటిషన్పై ఇవాళ(శుక్రవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్పై బయట ఉన్న ఏ-3 ఎన్.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది.
విదేశాల్లో ఉన్న ఫోన్ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్రావు(ఏ1), శ్రవణ్రావు(ఏ2)లపై రెడ్కార్నర్ నోటీసు జారీ చేయడానికి ఆలస్యమెందుకని హైకోర్టు పోలీసులను నిలదీసింది.
ఫోన్ట్యాపింగ్ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావుకు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం విషయం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీష్రావుపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును సీరియస్గా విచారణ చేపట్టారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.