Home » Politicians
నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్లో ఇదొక కీలక నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున తిరిగి పోటీచేస్తున్నారు.
పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు.
సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు.
మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా నారా లోకేశ్ తీర్చిదిద్దుతారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు
కంచుకంఠం.. మాటల తూటాలు.. ఇంతలోనే చమక్కులు.. ఆ వెంటనే చురుక్కులు.. విపక్షాలు సైతం వ్యక్తిగతంగా విమర్శలు చేయలేనంత గంభీరమైన వ్యక్తిత్వం..
మైనార్టీలకోసం వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మకండని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన శనివారం హిందూ పురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రహమతపురం ప్రాంతంలో పర్యటించి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహర్మరథం పట్టారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మండలంలోని హొట్టేబెట్ట, కొత్తపాళ్యం, టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, మల్లినమడుగు, ఎం రాయాపురం, బీజీ హళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ప్రతి గ్రామంలో హారతులతో ఘనస్వాగతం పలికారు. మల్లసముద్రం గ్రామంలో కార్యకర్తలు యాపిల్ పండ్ల గజమాలతో సత్కరించారు.
మడకశిర నియోజకవర్గంలోని వనరులను వినియోగించి ఉద్యాన హబ్గా మారుస్తామని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి అన్నారు. ఆ బాధ్యత తనదన్నారు. ఆయన శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇనచార్జ్ గుండుమల తిప్పేస్వామితో కలిసి రొళ్ల, అమరాపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీకే మాట్లాడుతూ... నియోజకవర్గానికి కృష్ణా జలాలను తెచ్చి ఇక్కడి అన్ని చెరువులను నింపుతామన్నారు. హార్టికల్చర్ కింద అభివృద్ధి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. నూతన టెక్నాలజీతో వక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలోనే పెనుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని పోలేపల్లి, నడింపల్లి, పూలేపల్లి, పెద్ద బాబ య్యపల్లి, చాలకూరు, గుడ్డంపల్లి తదితర గ్రామాల్లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దారిపొడ వునా మహిళలు హారతులలిచ్చి ఆశీర్వదించారు.