Home » swearing-in ceremony
రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేశారు.
ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి కనిపించింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన వెనక.. మెట్లపైన ఓ జంతువు వెళ్తూ కనిపించింది.
పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్నాథ్సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్’లో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్నారు. జూన్ 12న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.
వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్రెడ్డి, బండి సంజయ్. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్రెడ్డికి మరోసారి క్యాబినెట్ హోదా లభించగా, కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.
మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్లాల్నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.
బీజేపీ నేత, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు (జూన్ 9న) రాత్రి 7:15 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం(swearing ceremony) చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi) పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు.