Home » Vikarabad
గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు గత సర్కారు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.
Vikarabad News: మేక వన్నె పులి.. అంటారు. ప్రస్తుతం దొంగలు రోజుకో ప్లాన్తో ప్రజలను ఇలాగే దోచుకుంటున్నారు. తాజాగా నయా ప్లాన్తో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లాలో కొత్త తరహా దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూసేందుకు కుటుంబం లాగే ఉంటూ.. పక్కా స్కె్చ్ వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని కిచ్చనకుంట తండాలో జరిగింది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రేడార్ స్టేషన్ శంకుస్థాపన వాయిదా పడింది.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.