Home » YS Sunitha Reddy
justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వైదికగా వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను సైతం లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదయయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయా కేసుల్లోని ఉన్న వ్యక్తలను అరెస్ట్ చేస్తుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.
సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.
YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్మీట్ పెట్టారు. జగన్పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ABN Big Debate with YS Sunitha: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్లో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్లో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూలంకశంగా వివరించారు.