చేవెళ్ల తహసీల్దార్కు టీఆర్ఎస్ నాయకుల సన్మానం
ABN , First Publish Date - 2021-04-28T05:21:15+05:30 IST
చేవెళ్ల తహసీల్దార్కు టీఆర్ఎస్ నాయకుల సన్మానం

చేవెళ్ల : చేవెళ్ల మండల నూతన తహసీల్దార్గా నియమితులైన ఆశోక్కుమార్ను చేవెళ్ల మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులు తహసీల్దార్ను కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం. కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఎంపీటీసీలు నరేందర్చారి, సత్యనారాయచారి, ఉపసర్పంచ్ జాఫర్, ప్రభాకర్, మోసిన్, సీనియర్ నాయకులు మల్గాని నరేందర్గౌడ్, శివశంకర్రెడ్డి తదితరులున్నారు.