హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-08-29T03:36:11+05:30 IST
గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన గచ్చిబౌలికి చెందిన కృష్ణ యాదవ్(68)గా..

హైదరాబాద్: గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన గచ్చిబౌలికి చెందిన కృష్ణ యాదవ్(68)గా గుర్తించారు. కృష్ణ యాదవ్.. తన స్కూటీ పై గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వెళ్తుండగా గచ్చిబౌలి చౌరస్తా వద్ద స్కిడ్ అయ్యి కింద పడ్డారు. తీవ్ర గాయలైన కృష్ణ యాదవ్ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారుు. తీవ్రంగా రక్తస్రావం అవ్వడంతో చికిత్స పొందుతూ కృష్ణ యాదవ్ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.