AP News : ఆ కారణం చెప్పి కావలిలో ‘బ్రో’ షో నిలిపివేత.. పవన్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-07-28T11:36:36+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ అయితే తెగ సందడి చేసేస్తున్నారు. తాజాగా బ్రో చిత్రం ప్రదర్శితమవుతున్న కావలి లతా థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News : ఆ కారణం చెప్పి కావలిలో ‘బ్రో’ షో నిలిపివేత.. పవన్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

నెల్లూరు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ అయితే తెగ సందడి చేసేస్తున్నారు. తాజాగా బ్రో చిత్రం ప్రదర్శితమవుతున్న కావలి లతా థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లతా థియేటర్లో సౌండ్ సిస్టం ఐసీలు ఫెయిల్ అవ్వడంతో యాజమాన్యం షోను నిలుపుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యానికి పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. థియేటర్ వద్దకు చేరుకొని పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

మరోవైపు గూడూరు పట్టణం సంగం సినిమా థియేటర్ లో బ్రో సినిమా ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్యాన్స్ కు యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించివేసింది. దీంతో ఏకమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేయడంతో తిరిగి థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-07-28T11:36:36+05:30 IST