ప్రేమికుడి వద్దకు రాత్రి వేళ వెళ్లిన కూతురు.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన తల్లి.. చివరకు అంతా చూస్తుండగా..

ABN , First Publish Date - 2023-02-12T16:42:48+05:30 IST

తల్లికి తెలీకుండా ఓ యువతి పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలీకుండా కలుస్తూ ఉండేవారు. ఇటీవల ఓ రోజు యువతి.. తన తల్లికి చెప్పకుండా ప్రియుడిని కలుసుకునేందుకు అతడి గ్రామానికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకుని..

ప్రేమికుడి వద్దకు రాత్రి వేళ వెళ్లిన కూతురు.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన తల్లి.. చివరకు అంతా చూస్తుండగా..
ప్రతీకాత్మక చిత్రం

తల్లికి తెలీకుండా ఓ యువతి పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలీకుండా కలుస్తూ ఉండేవారు. ఇటీవల ఓ రోజు యువతి.. తన తల్లికి చెప్పకుండా ప్రియుడిని కలుసుకునేందుకు అతడి గ్రామానికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకుని ఆమెను కాపాడుకునేందుకు తల్లి కూడా వెళ్లింది. అయితే అక్కడ అంతా చూస్తుండగా.. గ్రామస్తులు తల్లిని వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ (Jharkhand) దుమ్కా జిల్లా పరిధి సరైయాహత్ సమీప గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ (Tribal woman) .. కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, ఈమె కుమార్తె కొన్ని నెలలుగా పక్క గ్రామానికి చెందిన పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం (Love with a married man) సాగిస్తోంది. తరచూ అతన్ని కలుస్తూ ఉండేది. ఈ విషయం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా దాచి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రాత్రి వేళ సదరు యువతి.. తన ప్రియుడిని కలిసేందుకు ఏకంగా అతడి ఇంటికే వెళ్లింది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా ప్రియుడి భార్య కంటపడ్డారు. దీంతో యువతిని ఆమె గట్టిగా నిలదీసింది.

Viral Video: కాల్చబోతుంటే.. తుపాకీకే ఎదురు నిలిచిన జింక.. దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే..

దీంతో అక్కడ పెద్ద గొడవ (quarrels) జరిగింది. అదే సమయంలో కూతరు ఇంట్లో లేకపోడం గమనించి వెతుక్కుంటూ తల్లి కూడా ఆ గ్రామానికి వచ్చింది. గొడవ జరగడం గమనించి.. కూతురు కాపాడుకునేందుకు నేరుగా వెళ్లి వాళ్లతో మాట్లాడింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు.. కూతురిని ఇలా పెంచడం నీ తప్పు అంటూ.. తల్లిని బంధించారు. అంతటితో ఆగకుండా చివరకు ఆమెను వివస్త్రను చేసి, దాడి (Assault on woman) చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తల్లీకూతుళ్లను వారి నుంచి విడిపించి స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. సుమారు 100మందిపై కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

గోనె సంచి మూటతో పగలంతా తిరిగిన వ్యక్తి.. చివరకు కాలువ పక్కన ఉండగా.. స్థానికులు వెళ్లి తెరచి చూడగా..

Updated Date - 2023-02-12T16:43:00+05:30 IST