శివ్వారం ఎల్‌ మడుగును సందర్శించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-08-01T22:04:29+05:30 IST

శివ్వారం ఎల్‌ మడుగు మొసళ్ల అభయారణ్యాన్ని మంగళవారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌, డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, గౌతమిలు సం దర్శించారు.

శివ్వారం ఎల్‌ మడుగును సందర్శించిన కలెక్టర్‌

జైపూర్‌, ఆగస్టు 1 : శివ్వారం ఎల్‌ మడుగు మొసళ్ల అభయారణ్యాన్ని మంగళవారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌, డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, గౌతమిలు సం దర్శించారు. మొసళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్‌ నుంచి గోదావరి అందాలను వీక్షించారు. సుమారు 2 గంటల పాటు అభయారణ్యంలో గడిపారు. అక్కడి పరిస్థితులను గురించి సంబంధిత అధికారులు వారికి వివరించారు. వారి వెంట తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, సర్పంచు గణేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-08-01T22:12:36+05:30 IST