Share News

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

ABN , First Publish Date - 2023-12-07T15:50:34+05:30 IST

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు.

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏఐసీసీ అగ్ర నేతలు తిరిగి తాజ్ కృష్ణ హోటల్‌కి చేరుకున్నారు. వీరితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి , తన కేబినేట్ మంత్రులు హోటల్‌కి వచ్చారు. సోనియా , రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో రేవంత్‌రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం ముగియడంతో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే మళ్లీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈమేరకు తాజ్ కృష్ణ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వీరు బయలు దేరి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఏఐసీసీ అగ్ర నేతలకి వీడ్కోలు పలకనున్నారు.

Updated Date - 2023-12-07T16:29:36+05:30 IST