Share News

CM Revanth Reddy: ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి

ABN , First Publish Date - 2023-12-11T21:29:38+05:30 IST

ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు.

CM Revanth Reddy: ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి

హైదరాబాద్: ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు. ఈ ప్రజావాణి ని ఇకనుంచి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2023-12-11T21:29:44+05:30 IST