Ganesh Immersion: చార్మినార్ వద్ద సందడి వాతావరణం.. హుస్సేన్‌సాగర్‌కు తరలుతున్న గణనాథులు

ABN , First Publish Date - 2023-09-28T13:51:02+05:30 IST

చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది.

Ganesh Immersion: చార్మినార్ వద్ద సందడి వాతావరణం.. హుస్సేన్‌సాగర్‌కు తరలుతున్న గణనాథులు

హైదరాబాద్: చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్‌కు భారీగా గణనాథులు తరలివెళ్తున్నారు. గణేశ్ విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. చార్మినార్ మీదుగా బాలాపూర్ గణేశుడు తరలివెళ్లనున్నాడు. మరో రెండు గంటల్లో చార్మినార్‌కు బాలాపూర్ గణేశ్ చేరుకోనున్నాడు. బాలాపూర్ గణేషుడిని అనుసరిస్తూ వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళనున్నాయి. మరోవైపు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారా మిలిటరీ బలగాలు ఉన్నాయి.

Updated Date - 2023-09-28T13:51:02+05:30 IST