BRS: మూడోసారి కేసీఆర్‌‌ను సీఎంగా ఆశీర్వదించండి.. జనగామలో బైక్ ర్యాలీ

ABN , First Publish Date - 2023-08-24T14:25:30+05:30 IST

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

BRS: మూడోసారి కేసీఆర్‌‌ను సీఎంగా ఆశీర్వదించండి.. జనగామలో బైక్ ర్యాలీ

సిద్దిపేట: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను (CM KCR) ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాల నుంచి దాదాపు 1500 మందితో కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం (Komuravelli Mallikarjuna Temple) వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (MLA Muthireddy Yadagirireddy) కొమురవేల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మల్లికార్జున స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆపై గంగిరేగు చెట్టు వద్ద ముడుపు కట్టారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు కార్యకర్తలు మోకాళ్ళపై నిల్చుని స్వామి వారిని వేడుకున్నారు.

Updated Date - 2023-08-24T14:25:30+05:30 IST