Share News

LAKSHMI NARASIMHA : గో వాహనంపై నారసింహుడు

ABN , Publish Date - May 24 , 2024 | 12:40 AM

బ్రహ్మోత్సవాలలో భాగంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురువారం గోవాహనంపై విహరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గోవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....

LAKSHMI NARASIMHA : గో వాహనంపై నారసింహుడు
Devotees procession the Utsavamurthys

బ్రహ్మోత్సవాలలో భాగంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురువారం గోవాహనంపై విహరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గోవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


సూర వెంకటచలమయ్య శెట్టి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. స్వామివారికి రాత్రి శేషవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదిగుబ్బకు చెందిన ఎం. సుదర్శనం, బళ్లారికి చెందిన సూరా లక్ష్మీపతి శెట్టి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈవో విజయ్‌ కుమార్‌, అర్చకులు పాల్గొన్నారు.

- ఉరవకొండ


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 24 , 2024 | 12:40 AM