Share News

Nandyal: నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు..

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:07 PM

పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్‌ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.

Nandyal: నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు..

నంద్యాల: పగిడ్యాల(Pagidyala) మండలం ఘణపురం (Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్‌ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు. విచారణ చేసిన నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు.. ఎస్సైను దోషిగా తేల్చింది. నేరం రుజువు కావడంతో మారుతీ శంకర్‌కు 3నెలల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మారుతీ శంకర్ ప్రస్తుతం సీఐగా ప్రమోషన్ పొంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సీఐ స్థాయి వ్యక్తికి శిక్ష పడడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Updated Date - Jun 20 , 2024 | 07:07 PM