Share News

ఎంపీ విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది: మంత్రి కొల్లు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:52 AM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టిందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది: మంత్రి కొల్లు

మచిలీపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టిందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విజయసాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేక విలేకరులను ‘ఏరా, ఒరేయ్‌’ అనడం సిగ్గుచేటు.

చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు బాధ్యత కలిగిన ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డి దుర్మార్గంగా, బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. మీడియాసంస్థల యాజమాన్యాలపై, విలేకర్లపై విమర్శలు సిగ్గుచేటు. భవిష్యత్తులో ఆయన తగిన మూల్యం తప్పక చెల్లించుకుంటారు. విజయసాయిరెడ్డికి కామంతో, పేర్ని నానికి డబ్బు మదంతో కళ్లుమూసుకుపోయి మాట్లాడుతున్నారు. పేర్ని అక్రమ ఆస్తుల చిట్టాలన్నీ మా వద్ద ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయి విచారణ చే సి అన్ని లెక్కలు త్వరలోనే తేలుస్తాం. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది’ అని మంత్రి కొల్లు హెచ్చరించారు.

Updated Date - Jul 19 , 2024 | 05:53 AM