Share News

‘అనంత అర్బన్‌’లో ఆరని మంటలు

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:53 AM

అనంతపురం అర్బన్‌, మార్చి 30: టీడీపీ అనంతపురం అర్బన్‌ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి కేటాయించకపోవడంతో ఆయన వర్గీయులు శనివారం రెండో రోజు నిరసనలు కొనసాగించారు.

‘అనంత అర్బన్‌’లో ఆరని మంటలు

చౌదరికి మద్దతుగా దంపతుల ఆత్మహత్యాయత్నం

టీడీపీ రుద్రంపేట కార్యాలయ ఫర్నిచర్‌ దహనం

అనంతపురం అర్బన్‌, మార్చి 30: టీడీపీ అనంతపురం అర్బన్‌ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి కేటాయించకపోవడంతో ఆయన వర్గీయులు శనివారం రెండో రోజు నిరసనలు కొనసాగించారు. అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేటలోని పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. ఫర్నిచర్‌, ఫ్లెక్సీలు, కరపత్రాలను బయట కుప్పగావేసి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయ బోర్డును చించేశారు. చౌదరికి టికెట్‌ ఇవ్వకపోతే తాము ఎలా బతకాలంటూ అనంతపురం రూరల్‌ మండలం నారాయణపురం పంచాయతీకి చెందిన దంపతులు నాగరాజు, మమత తమ వెంట తెచ్చుకున్నవిష రసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated Date - Mar 31 , 2024 | 08:35 AM