Share News

Election 2024: ముఖ్య నేత నామినేషన్‌ను తిరస్కరించిన ఈసీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:48 PM

లోక్‌సభ ఎన్నికలు-2024 నామినేషన్ల పరిశీలనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Election 2024: ముఖ్య నేత నామినేషన్‌ను తిరస్కరించిన ఈసీ

నాగర్‌కర్నూల్: లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls 2024) నామినేషన్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన బీఎస్పీ (BSP) అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌ను (Manda jagannath) దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పార్టీ బీ-ఫామ్ లేనందున తిరస్కరిస్తున్నట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. దీంతో నాగర్‌కర్నూల్ బరి నుంచి బీఎస్పీ అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది.

కాగా లోక్‌సభ నామినేషన్లకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం నేడు పరిశీలన జరిగింది. అన్ని నామినేషన్లను అధికారులు నిశితంగా పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఐఎంలో భయం మొదలైందా.. హైదరాబాద్‌లో అదే జరగనుందా..!

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కీలక నేత రాజీనామా

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 05:04 PM