Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు..

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:34 PM

హనుమకొండ జిల్లా మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. మామా అల్లుళ్లు కేసీఆర్‌, హరీశ్‌రావు తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రారు గానీ.. టీవీ చానల్‌లో మాత్రం నాలుగు గంటలు సొల్లు చెప్పారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు చచ్చిన పాము లాంటిదని, ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్‌, నరేంద్రమోదీ తోడు దొంగలని, ఇద్దరూ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు చెప్పినట్లే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 1/7

హనుమకొండ జిల్లా, మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నేతలు గజమాలతో సన్మానం చేస్తున్న దృశ్యం.

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 2/7

మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. ఇంకా కాంగ్రెస్ నేతలు.

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 3/7

హనుమకొండ జిల్లా, మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం. ఇంకా మంత్రి కొండా సురేఖ తదితరులను చూడవచ్చు.

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 4/7

హనుమకొండ జిల్లా, మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రసంగిస్తున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క.

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 5/7

హనుమకొండ జిల్లా, మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రసంగిస్తున్న వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. ఆమె తండ్రి కడియం శ్రీహరి..

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 6/7

హనుమకొండ జిల్లా, మడికొండలో జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రసంగిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Congress: మడికొండలో కాంగ్రెస్‌ జనజాతర సభ దృశ్యాలు.. 7/7

హనుమకొండ జిల్లా, మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభకు భారీగా తరలి వచ్చిన జనసందోహం..

Updated at - Apr 25 , 2024 | 12:34 PM