Minister Nara Lokesh: మంగళగిరిలో వేడుకగా ఇంటి పట్టాల పంపిణీ
ABN, Publish Date - Apr 05 , 2025 | 11:09 AM
ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వారు నివసిస్తున్న స్థలాలపై శాశ్వత ఇంటి పట్టా అందించే మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటి పట్టాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు.

ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వారు నివసిస్తున్న స్థలాలపై శాశ్వత ఇంటి పట్టా అందించే మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటి పట్టాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు.

మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన సభలో యర్రబాలెం, నీరుకొండ గ్రామాలతో పాటు మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 546 పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందించారు.

అలాగే యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు, నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు

2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగే విధంగా 91వేల ఓట్ల భారీ మెజార్టీతో మంగళగిరి ప్రజలు తనను గెలిపించి శాసనసభకు పంపించారని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.

రెండున్నర దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు తనను కోరారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ప్రజాప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే మొదటి విడతలో 3వేల మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందించానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కును ప్రజలకు కూటమి ప్రభుత్వం అందజేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే మంగళగిరిలో చెప్పానని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.

మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ మాటిచ్చారు.
Updated at - Apr 05 , 2025 | 11:15 AM