Share News

India vs Zimbabwe: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ వారిదే!

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:32 PM

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం జింబాబ్వే, భారత జట్లు నాలుగో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి..

India vs Zimbabwe: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ వారిదే!
India vs Zimbabwe

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం జింబాబ్వే, భారత జట్లు నాలుగో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. జింబాబ్వే బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత్.. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేసి, 2-1 తేడాతో ఆధిక్యం సాధించింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ కైవసం అవుతుంది. దీంతో.. హ్యాట్రిక్ విన్ నమోదు చేసి, సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు.. టీమిండియా చేతిలో వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన జింబాబ్వే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడిపోకూడదన్న సంకల్పంతో బరిలోకి దిగుతోంది. భారత్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసి.. ఈ మ్యాచ్‌లో నెగ్గాలని చూస్తోంది. మరి.. ఎంతో ముఖ్యమైన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఎలా రాణిస్తాయో? ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.


తుది జట్లు

జింబాబ్వే: వెస్లీ మధెవెర్, మరుమాని, బ్రియాన్ బెనెట్, డియోన్‌ మైయర్స్, సికిందర్ రజా (కెప్టెన్‌), జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్‌ మడాండే, ఫరాజ్‌ అక్రమ్, ఎంగరవ, ముజరబాని, చటార.

భారత్: శుభ్‌మన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్‌ శర్మ, రుతురాజ్, సంజు శాంసన్‌, శివమ్‌ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్‌.

Updated Date - Jul 13 , 2024 | 04:32 PM