Share News

Chandrababu: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:55 PM

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు.

Chandrababu: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు (NTR Trust Bhavan) చేరుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు. తర్వాత తెలంగాణ నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీటీడీపీ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.


కాగా అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ట్రస్ట్‌ భవన్‌కు టీటీడీపీ నేతల ర్యాలీతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు బయల్దేరారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వస్తున్నారు. ర్యాలీకి టీటీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ భవన్‌ దగ్గర కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ మహిళా కార్యకర్తలు బోనాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 12:55 PM