రోత పత్రికలో అవే కట్టు కథలు..

ABN, Publish Date - Sep 24 , 2024 | 11:28 AM

ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారేమోనన్న ఉద్దేశంతో లేనివి.. జరగనివి తెరపైకి తెచ్చి కథనాలు రాస్తూ జనాన్ని నమ్మించడానికి రోత పత్రిక ఆపసోపాలు పడుతోంది.

అమరావతి: కిందపడినా తమదే పైచేయి అంటోంది జగన్ రోత మీడియా.. పరిశ్రమలను తన్ని తరిమేసిన జగన్ సర్కార్ హయాంలోనే ఏపీకి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. జగన్ కష్టాల్లో ఇరుక్కున్న ప్రతిసారి ఆయన హయాంలో అద్బుతాలు జరిగాయంటూ కథనాలు వండి వార్చడం రోత మీడియాకు అలవాటే. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారేమోనన్న ఉద్దేశంతో లేనివి.. జరగనివి తెరపైకి తెచ్చి కథనాలు రాస్తూ జనాన్ని నమ్మించడానికి రోత పత్రిక ఆపసోపాలు పడుతోంది.


కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖలోని పరిశ్రమలు, అంతర్గత, వాణిజ్య ప్రోత్సాహక విభాగం.. డీపీఐఐటీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తమ అధినేత పాలనలో భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ గ్రాఫిక్‌లతో జిమ్మిక్కులు చేసింది. కోవిడ్ అనంతరం 2021 నుంచి ఈ ఏడాది మే వరకు ఏపీలో కొత్తగా 171 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ. 61,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అదే సమయంలో మరో 179 పాడి పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి కూడా ప్రారంభించాయని దీంతో గడిచిన మూడున్నరేళ్లలో రూ. 76,278 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట

తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..

మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..

కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 24 , 2024 | 11:28 AM