‘వొడాఫోన్’లో ప్రభుత్వానికి మరింత వాటా
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:36 AM
వొడాఫోన్ ఐడియా ఈక్విటీలో ప్రభుత్వ వాటా ప్రస్తుత 22.6 శాతం నుంచి 48.99 శాతానికి పెరగనుంది. స్పెక్ట్రమ్ బకాయిల కింద తనకు రావలసిన రూ.36,950 కోట్లను...

న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా ఈక్విటీలో ప్రభుత్వ వాటా ప్రస్తుత 22.6 శాతం నుంచి 48.99 శాతానికి పెరగనుంది. స్పెక్ట్రమ్ బకాయిల కింద తనకు రావలసిన రూ.36,950 కోట్లను ఒక్కోటి రూ.10 ముఖ విలువ ఉండే 3,695 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి చేరనుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. అయినా కంపెనీ నిర్వణ ప్రస్తుత ప్రమోటర్లు వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ వద్దే ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు వొడాఫోన్ ఐడియాలో వరుసగా 14.76 శాతం, 22.56 శాతం వాటా ఉంది.
Read More Business News and Latest Telugu News