AP Tourism Policy: పర్యాటక పెట్టుబడులకు కమిటీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:12 AM
ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 కింద పెట్టుబడుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టూరిజం అథారిటీ సీఈవో అధ్యక్షతన తొమ్మిది మందితో ఈ కమిటీ పనిచేస్తుంది

అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 ప్రకారం రాష్ట్రానికి వచ్చే పర్యాటక పెట్టుబడులను పరిశీలించి, ధ్రువీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈవో, సభ్యులుగా మరో ఎనిమిది మంది ఉంటారు ఏపీటీడీసీ ఈడీ, చీఫ్ ఇంజనీరు తదితరులు ఉంటారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News