అవ్వకు స్వర్ణ కిరీటం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:53 PM
ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు.

ఆదోని టౌన, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. రూ.కోటి ఖర్చుతో ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు ఆలయ చైర్మన రాచోటి రామయ్య బుధవారం వెల్లడించారు. కిరీటాన్ని అందంగా తయారు చేయడంలో సహకరించిన జీఆర్టీ జ్యూవెల్లర్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వర్ణ కిరీటాన్ని 93వ రథోత్సవం రోజున అవ్వకు అలంకరించనున్నట్టు వెల్లడించారు.