Neha Reddy Illegal Construction: బీచ్లో ‘నేహారెడ్డి నిర్మాణాల’ తొలగింపు ఖర్చు కోటి..!
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:13 AM
భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నేహారెడ్డి కంపెనీ ప్రహరీను తొలగించేందుకు జీవీఎంసీ రూ.కోటి ఖర్చు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి, వ్యయం నేహారెడ్డి కంపెనీ నుంచే వసూలు చేయాలని ఆదేశించారు.

సీఆర్జడ్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులకు ఫిర్యాదు?
విశాఖపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): భీమిలి బీచ్లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో నేహారెడ్డి (మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె) కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం జిల్లా వైసీపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు భీమిలిలో పెద్ద స్టార్హోటల్ నిర్మించే ఉద్దేశంతో సుమారు నాలుగు ఎకరాల భూమిని వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి కొనుగోలు చేశారు. ఈ నాలుగు ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించారు. పది అడుగుల లోతులో భారీగా వేసిన వీటిని తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. తొలగింపు వ్యయం కూడా నేహారెడ్డి కంపెనీ నుంచే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రహరీ తొలగింపు, పునాదుల పెకిలింపు పనులకు రూ.73 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై సముద్ర అధ్యయన సంస్థ (ఎన్ఐఓ) అధ్యయనం చేసింది. వారికి రూ.15 లక్షలు చెల్లించారు. మొత్తంగా పని పూర్తయ్యేసరికి రూ.కోటి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా కోస్తా నియంత్రణ మండలిలో నిర్మాణాలు చేపట్టినందున పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైకో ర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ పని కూ డా పూర్తిచేసి బుధవారం కోర్టుకు నివేదిక అందించాలని యత్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News