Share News

Election: బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా సతీ్‌షశర్మ

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:02 AM

కోశాధికారిగా గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పులిపాక ప్రసాద్‌, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం గ్రామంలో సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-27 రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది.

 Election: బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా సతీ్‌షశర్మ

ప్రధాన కార్యదర్శిగా మనోహరరావు

నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

గుంటూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా గుంటూరులోని గోరంట్లకు చెందిన కోనూరు సతీ్‌షశర్మ, ప్రధాన కార్యదర్శిగా కర్నూలుకు చెందిన హెచ్‌కే మనోహరరావు, కోశాధికారిగా గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పులిపాక ప్రసాద్‌, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం గ్రామంలో సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-27 రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.324 కోట్ల నిధులు కేటాయించటంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌లకు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సతీ్‌షశర్మ, ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు కృతజ్ఞతలు తెలియజేశారు. ముగ్గురు బ్రాహ్మణులకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌గా అవకాశం కల్పించటంతోపాటు ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించి బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని పెంచారని హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ వర్గీయుల సంక్షేమం, అభివృద్ధికి సమాఖ్య నిరంతరం అండగా నిలుస్తుందన్నారు. సమాఖ్య ఉపాధ్యక్షులుగా మైసూరు శ్రీనివాస మూర్తి, ఆత్మకూరు శివకుమార్‌ శర్మ, సురేష్‌ బాబు, తోటపల్లి లోకనాథ్‌శర్మ, కొడిపి నాగేశ్వర రావు, రాపాక వెంకట ప్రభాకర్‌, మాచిరాజు రవికుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నార్పల మారుతి, పొన్నపల్లి సోమశేఖర్‌, ప్రభాకరం, ద్వాదశి వేణు, అధికార ప్రతినిఽధులుగా నార్పల రమేష్‌ , తేలికేపల్లి వెంకటేశ్వర్లు, వేల్పూరు సుబ్రహ్మణ్యం, ఉత్తరాంధ్ర రీజియన్‌ కో ఆర్డినేటర్‌గా ఇనుగంటి రాకేష్‌ శర్మ ఎన్నికయ్యారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 05:02 AM