ముమ్మరంగా సాగుతున్న పుష్కరిణి నిర్మాణ పనులు
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:02 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో రూ. 2.80 కోట్లతో నిర్మిస్తున్న పుష్కరిణి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

మంత్రాలయం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో రూ. 2.80 కోట్లతో నిర్మిస్తున్న పుష్కరిణి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బృందావనం గెస్ట్హౌస్ సమీపంలో 165 అడుగులపొడవు 70 అడుగుల వెడల్పు 7.5 అడుగుల లోతుతో పుష్కరిణి పనులు చేపట్టారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్కరిణి పనులు నాణ్యత ప్రమాణాలతో భక్తులకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మఠం మేనేజర్, ఈఈ సురేష్ కోణాపూర్, ఏఈ బద్రినాథ్ దగ్గర ఉండి కాంట్రాక్టర్ ఓబులయ్య, సైట్ ఇంజనీర్ ఉబ్బ శ్రీనావాసులు, సూపర్వైజర్ హనుమంతులు పనులు చురుగ్గా చేస్తున్నారు.