ఆయుధ డిపో వద్దు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:31 AM
బాడంగికి దగ్గర్లో ఆయుధ డిపో ప్రతిపాదనలు ఆపాలని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.శంకరరావు కోరారు.

బాడంగి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బాడంగికి దగ్గర్లో ఆయుధ డిపో ప్రతిపాదనలు ఆపాలని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.శంకరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ ఈ ప్రాంతంలో ఆయుధ డిపో ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకి స్తున్నామని అన్నారు. సంవత్సరానికి మూడు పంట లు పండే సారవంతమైన భూములను ఈ ఆయుధ డిపోకు ఇవ్వవలసిన అవసరం తమకు లేదన్నారు. అనంతరం డీటీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎ.సురేష్, పాల్తే రు ఎంపీటీసీ సభ్యుడు రమేష్, సర్పంచ్ ప్రతినిధి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.