బ్యాంకు ఖాతాలకు ఇక నలుగురు నామినీలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:05 AM
బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఇక తమ ఖాతాలకు నలుగురు వరకు నామినీలుగా నామినేట్ చేయవచ్చు...

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఇక తమ ఖాతాలకు నలుగురు వరకు నామినీలుగా నామినేట్ చేయవచ్చు. దీనికి సంబంధించి బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుకు రాజ్యసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్సభ గత ఏడాది డిసెంబరులోనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఒక వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే ‘చెప్పుకోదగ్గ’ మొత్తం’ నిర్వచనాన్నీ ఈ బిల్లు ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచింది.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News