CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు మార్ఫింగ్
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:32 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్న వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్సబీ) పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

బీఆర్ఎ్సపై సందేహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు
ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్న వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్సబీ) పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తెలంగాణ మత్స్యశాఖ కొ-ఆపరేటీవ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఎ్సబీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సాయి కుమార్ పోలీసులను కోరారు.