KTR: జింక రక్తపు మరకలు రాహుల్ చేతికే అంటాయి
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:49 AM
ఆ జింక రక్తపు మరకలు రాహుల్ గాంధీ చేతికే అంటాయని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

రేవంత్ చర్యలతో వృక్ష, జంతుజాలానికి నష్టం: కేటీఆర్
కంచ గచ్చిబౌలి భూముల్లో విధ్వసం తర్వాత విచ్చలవిడిగా సంచరిస్తున్న కుక్కలు.. ఓ జింకపై దాడి చేశాయని, తీవ్రంగా గాయపడిన జింకను హెచ్సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెటర్నరీ ఆస్పత్రికి తరలించేసరికే మృత్యువాత పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జింక రక్తపు మరకలు రాహుల్ గాంధీ చేతికే అంటాయని ‘ఎక్స్’ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.