Share News

Hyderabad: రాయదుర్గంలో త్రినాయ్‌, సీరం లక్స్‌ ఆస్పత్రుల ప్రారంభం

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:07 AM

ఆర్థోపెడిక్‌ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్‌ దినేశ్‌ సుంకర హైదరాబాద్‌లోని రాయదుర్గంలో త్రినాయ్‌ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు.

Hyderabad: రాయదుర్గంలో త్రినాయ్‌, సీరం లక్స్‌ ఆస్పత్రుల ప్రారంభం

  • జ్యోతి వెలిగించిన మాజీ సీజేఐ ఎన్వీ రమణ, దర్శకుడు రాఘవేందర్‌రావు

  • స్పీకర్‌ ప్రసాద్‌, ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే, ఇతర ప్రముఖుల హాజరు

    26.jpg

రాయదుర్గం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆర్థోపెడిక్‌ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్‌ దినేశ్‌ సుంకర హైదరాబాద్‌లోని రాయదుర్గంలో త్రినాయ్‌ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు. అలాగే ఇదే భవనంలో డాక్టర్‌ పీ. లక్ష్మీ మౌనిక, డాక్టర్‌ సుస్మిత రెడ్డి ఆధ్వర్యంలో హెయిర్‌, స్కిన్‌, సౌందర్య చికిత్స అందించేందుకు ప్రపంచ స్థాయి సాంకేతికతతో, ఆధునిక యంత్ర పరికరాలతో సీరం లక్స్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సినీ దర్శకుడు రాఘవేందర్‌ రావు పాల్గొని జ్యోతి వెలిగించారు.


ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ మాట్లాడారు. ఈ ఆస్పత్రులు ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకొచ్చిన డాక్టర్లను ఆయన అభినందించారు. ఆస్పత్రుల ప్రారం భ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌, దర్శకుడు బోయపాటి శ్రీను పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 05:07 AM