చిన్నారిపై బీరు సీసాతో సైకో దాడి..

ABN, Publish Date - Mar 23 , 2025 | 01:30 PM

పోచారం ఐటీ కారిడార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో గాయపడిన చిన్నారి తుది శ్వాస విడిచింది. ఐటీ కారిడార్ పరిధిలో శనివారం రోజు సైకో రెచ్చిపోయాడు.

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో గాయపడిన చిన్నారి తుది శ్వాస విడిచింది. ఐటీ కారిడార్ పరిధిలో శనివారం రోజు సైకో రెచ్చిపోయాడు. పలువురిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇదే క్రమంలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపైనా బీరు సీసాతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కాగా, చికిత్సపొందుతూ చిన్నారి మృతిచెందింది. మరోవైపు సైకోను స్థానికులంతా నిన్ననే పట్టుకున్నారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు.

Updated at - Mar 23 , 2025 | 01:30 PM