-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh telangana national and international latest news andhra jyothy news on 26th march 2025 suri
-

Breaking News: భద్రాచలంలో విషాదం కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
ABN , First Publish Date - Mar 26 , 2025 | 08:28 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-26T15:29:50+05:30
భద్రాచలంలో విషాదం కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం
భద్రాచలం లో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నేలమట్టం
అనుమతులు లేకుండా నిర్మాణం
ఒక్కసారిగా కుప్ప కూలిన భవనం
శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు
సహాయ చర్యలు చేపట్టిన రెస్క్యూ అండ్ పోలీస్ టీం
-
2025-03-26T14:12:25+05:30
వైసీపీ నేతల కారుల్లో మందుగుండు సామగ్రి..
సత్యసాయి జిల్లా: రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఉద్రిక్తత
వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
పలు వాహనాలు ధ్వంసం, ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్
వైసీపీ నేతల వాహనాల్లో వేట కొడవళ్లు, మందు గుండు సామగ్రి గుర్తించిన పోలీసులు
తమ దగ్గర తుపాకులు ఉన్నాయంటూ గతంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
ప్రకాశ్ రెడ్డి సోదరులు వాడే వాహనాల్లోనే మారణాయుధాలు, మందుగుండు సామగ్రి గుర్తింపు
ఆ వాహనాలను రామగిరి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
-
2025-03-26T14:04:48+05:30
పూజారికి జీవిత ఖైదు విధించిన కోర్టు..
రంగారెడ్డి: సరూర్ నగర్లో మహిళ హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేసిన పూజారి సాయి
శంషాబాద్లో హత్య చేసి కారులో తీసుకెళ్లి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టిన నిందితుడు
నాలుగేళ్లపాటు మహిళతో ప్రేమకలాపాలు నడిపి ముఖం చాటేసిన పూజారి
పెళ్లి చేసుకోమని అడగడంతో కిరాతకంగా హత్య చేసిన పూజారి సాయి
ఈ కేసులో పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు
సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు అదనంగా జైలు శిక్ష
-
2025-03-26T13:30:11+05:30
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తీవ్రగాయాలు..
తిరుపతి: బాత్రూమ్లో జారిపడిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి కుడిచేయి ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారణ
ప్రైవేట్ ఆస్పత్రిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చికిత్స
-
2025-03-26T12:56:36+05:30
పాస్టర్ మృతిపై హోంమంత్రి అనిత ఆరా..
రాజమహేంద్రవరం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి అనిత
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన హోంమంత్రి
పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత
పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశం
క్రైస్తవ సంఘాలు కోరిక మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలిపిన ఎస్పీ
-
2025-03-26T12:53:56+05:30
పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు..
రాజమహేంద్రవరం: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి
పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణ జరపాలంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద ఆందోళన
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగిన పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
-
2025-03-26T12:48:54+05:30
పాస్టర్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం
రాజమహేంద్రవరం: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం
పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించిన చంద్రబాబు
ఈ విషయంపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రాజమహేంద్రవరం చాగల్లులో క్రైస్తవ సభలకు వస్తుండగా మృతిచెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల
-
2025-03-26T12:19:03+05:30
కాంగ్రెస్ మాదిగ వర్గం ఎమ్మెల్యేలు లేఖ..
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ మాదిగవర్గం ఎమ్మెల్యేల లేఖ
మంత్రివర్గంలో మాదిగ నేతకి అవకాశమివ్వాలంటూ మీనాక్షికి లేఖ రాసిన ఎమ్మెల్యేలు
రాష్ట్ర జనాభాలో దాదాపు 45 లక్షల మంది మాదిగలు ఉన్నారని లేఖలో పేర్కొన్న ఎమ్మెల్యేలు
గతేడాది ఎన్నికల్లో మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని లేఖలో తెలిపిన ఎమ్మెల్యేలు
-
2025-03-26T12:11:09+05:30
ఎమ్మెల్యే కేటీఆర్పై కేసు నమోదు..
నల్లగొండ: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో చెలరేగిన రాజకీయ దుమారం
పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్పై రెండు కేసులు నమోదు
కేటీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తప్పుడు ఆరోపణలు చేశారంటూ నకిరేకల్ పీఎస్లో ఫిర్యాదు
కేటీఆర్పై ఫిర్యాదు చేసిన నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ రజిత శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ఉగ్గడి శ్రీనివాస్
మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ ఛైర్మన్కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్
తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన రజిత శ్రీనివాస్
కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ సైతం సోషల్ మీడియాపై ఫిర్యాదు
వారి ఫిర్యాదు మేరకు కేటీఆర్పై నకిరేకల్ పీఎస్లో రెండు కేసులు నమోదు
-
2025-03-26T11:36:46+05:30
తూర్పుగోదావరి జిల్లా దారుణం..
తూర్పుగోదావరి: అనపర్తి మండలంలో రెచ్చిపోయిన కామాంధులు
మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన దుర్మార్గులు
ఆ వీడియో చూపించి కోర్కెలు తీర్చాలంటూ బాధితురాలికి బెదిరింపులు
కామాంధుల వేధింపులు తాళలేక అనపర్తి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఆమె ఫిర్యాదు ఆధారంగా నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
-
2025-03-26T11:12:51+05:30
కలకలం రేపిన మగశిశువు విక్రయం
కామారెడ్డి: క్యాసంపల్లిలో కలకలం రేపిన మగశిశువు విక్రయ వ్యవహారం
ఈనెల 19న సిరికొండ మండలానికి చెందిన వారికి బాబును బేరం పెట్టిన మధ్యవర్తులు
రూ.55 వేలకు చిన్నారి విక్రయించేందుకు ఒప్పందం
మధ్యవర్తులు, బిడ్డను అమ్మిన వారికి మధ్య పంపకాల వద్ద గొడవ
వారి గొడవతో వెలుగులోకి వచ్చిన దారుణం
కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు
-
2025-03-26T10:34:26+05:30
దారుణం.. చిన్నారిపై రెచ్చిపోయిన కామాంధుడు..
అల్లూరి జిల్లా: ఎటపాక మండలంలో దారుణ ఘటన
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో దర్యాప్తు
-
2025-03-26T10:31:48+05:30
ఒక్కసారిగా వెనక నుంచి లారీని ఢీకొట్టిన బస్సు.. ఆ తర్వాత..
యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద 65వ జాతీయ రహదారిపై ఢీకొన్న లారీ, ట్రావెల్స్ బస్సు
కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, ఆ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన మరో బస్సు
రెండు బస్సుల డ్రైవర్లకు, ప్రయాణికులకు తీవ్రగాయాలు, చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలింపు
-
2025-03-26T10:26:47+05:30
మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత..
హైదరాబాద్: మాజీమంత్రి కొడాలి నానికి అస్వస్థత
గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని
టెస్టుల తర్వాత గుండె సమస్యలు ఉన్నట్టు తేల్చిన వైద్యులు
ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స
నాని ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయనున్న వైద్యులు
-
2025-03-26T08:50:48+05:30
లారీ ఢీకొని భార్యభర్త మృతి..
అల్లూరి జిల్లా: పాడేరు- అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం
హుకుంపేట మండలం కోట్నాపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ
లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు
-
2025-03-26T08:36:12+05:30
ఘోర రోడ్డుప్రమాదం..
హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం
ప్రమాదవశాత్తూ కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
-
2025-03-26T08:28:01+05:30
ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు..
రంగారెడ్డి: మహేశ్వరం పరిధి రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఇద్దరు నిందితులు హర్యానా రాష్ట్రం మేవాత్కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు
ఈనెల 3న రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ.13 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులు
నిందితులు ముంబై వైపునకు వెళ్తూ మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీకి యత్నం
షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, అక్కడ్నుంచి పారిపోయిన దొంగలు
నిందితుల కోసం మేవత్కు వెళ్లిన ప్రత్యేక బృందాలు, స్థానికుల సహాయంతో అరెస్టు
నిందితుల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన యంత్రం, ఇతర సామగ్రి స్వాధీనం