పోలీసుల తీరుపై విమర్శలు..
ABN, Publish Date - Mar 29 , 2025 | 02:04 PM
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satyasai district)లో వైసీపీ (YCP) నేతలకు పోలీస్ ఉన్నతాధికారులు (Police officers) జీ హుజూర్ అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే (Raptadu Ex MLA) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Topudurthi Prakash Reddy) దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 రోజుల క్రితం రామగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నేతల వాహనాల్లో వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. అవి ఎక్కడవి.. ఎవరి దగ్గర నుంచి తీసుకువచ్చారు.. అనే కోణంలో విచారించాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: టీడీపీలో హిట్ పుట్టిస్తున్న కొలికపూడి ఎపిసోడ్..
ఈ వార్తలు కూడా చదవండి..
మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం..
కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా...
నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
For More AP News and Telugu News
Updated at - Mar 29 , 2025 | 02:04 PM