Home » Andhra Pradesh
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్కు సూచిస్తున్నానన్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసు అప్రూవర్ షేక్ దస్తగిరి పిటిషన్ వేయడం జరిగింది. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గురువారం రాత్రి పది గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన యువకులు 20 మంది ప్రచారానికి అడ్డుగా వచ్చి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు.
‘రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఇసుకలో సీఎం జగన్ తిన్నదంతా మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తాం. అడ్డగోలుగా రేటు పెంచి జనం జేబులు ఖాళీ చేసి రూ.వేల కోట్లు బొక్కారు.
‘ఎన్నికల మేనిఫెస్టో తర్వాత వైఎస్ జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. గుంటూరు, నర్సాపురం వంటి ఎంపీ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి స్వీప్ చేస్తుంది
ఏటా సింగిల్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. నిరుద్యోగులు పేపర్లు తీసుకుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో నూతన క్రిమినల్ చట్టాలపై న్యాయాధికారులకు గురువారం అవగాహన తరగతులు ఏర్పాటు చేశారు.
విశాఖలో భూములు లాక్కుంటున్నారు. ధనవంతులు భయపడి అమెరికాకు వెళ్లిపోతున్నారు. ఎన్నాళ్లిలా? ఎంతమంది సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోగలరు? మేం అండగా ఉంటాం.
జగన్కు రాష్ట్రాభివృద్ధి కన్నా హత్యా రాజకీయాలే ఎక్కువ. బాబాయిని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారు.