Home » Arvind Kejriwal
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం వ్యవహరంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు.
కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేతలు, సీఎం చంద్రబాబు, సీఎం నితీష్ కుమారుకు ఆయన సూటిగా ప్రశ్నను సంధించారు.
'సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం లేఖాస్త్రాం సంధించారు.
మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఆటోవాలాలకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం అందిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఆటో డ్రైవర్ నవ్నీత్ ఇంట్లో కేజ్రీవాల్, ఆయన భార్య నవనీత్ మంగళవారంనాడు లంచ్ తీసుకున్నారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యవహారంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్ పురా స్థానం నుంచి మనీశ్ సిసోడియా బరిలో దిగనున్నారు.
బీజేపీపై పోరుకు ఆప్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.
కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్లోని బికనెర్లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.