Home » Bhupathiraju Srinivasa Varma
పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్పోర్టుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.
Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
Srinivas Varma: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలో 2కే వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రకటించిన రూ. 11,400 కోట్ల ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ ప్రకటన తర్వాత, విశాఖ పాంట్లో ఉత్పత్తి పెరగడమే గాక, అనేక మార్పులు వచ్చినట్లు తెలిపారు.
Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.
Srinivasa Varma: కేంద్ర బడ్జెట్పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ హయంలో రూ 12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.
Srinivasa Varma: స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయని... వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ను ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. సిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు.
Minister Nara Lokesh: విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు.
Union Minister Bhupatiraju Srinivasa Varma: వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నోచుకోలేదని కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని చెప్పారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రామాయణపట్నం , అనకాపల్లితో పాటు మరికొన్ని పరిశ్రమలును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.