Home » Kukatpally
కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ పున్నం తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి డి.శ్రీధర్బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్రెడ్డి, కేపీ వివేకానంద..
కూకట్పల్లిలోని లులు మాల్లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మాల్లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్కు బూజు పట్టినట్టు గుర్తించారు.
టీఎస్ఎప్సెట్ కౌన్సెలింగ్కు సమయం ఆసన్నమవుతున్నప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ(JNTU) ఇచ్చే అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. ఎప్సెట్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 27నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు నెలరోజుల (మే24న)కిందటే తేదీలను ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్రెడ్డి,
ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నగరానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna)ను కూకట్పల్లికి చెందిన టీడీపీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు శనివారం కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) గుర్తు చేశారు.
కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు.