Home » Narendra Modi
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో మెట్రో విస్తరణ స్తంభించిపోయిందని, ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి తోడ్పడాలని విన్నవించారు.
Russia-India Ties : మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ దేశాలు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరువైపులా లక్షల మంది మరణించారు. గాయపడ్డారు. ఉక్రెయిన్ను సాయమందిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, అన్నింటినీ తట్టుకుని రష్యా సగర్వంగా నిలబడింది. ప్రపంచ దేశాలు ఊహించనిది చేసి చూపించింది. అదేంటంటే..
ప్రధాని తన ప్రసంగంలో మహాకుంభ్ను విజయవంతం చేసేందుకు పారిశుధ్య కార్మికులు, పోలీసులు సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రశంసించారు. ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన 'గ్రేట్కుంభ్' ఇదని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో పాల్గొన్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు.
దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ తనతో పాటు లక్షలాది మందిలో కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారంనాడు జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనలో ప్రధాని మాట్లాడుతూ, భారత భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.
వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్ మూత తీసి అందులోని నీటిని పవార్కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు.
ఇండియా గ్రోత్ గురించి మోదీ వివరిస్తూ 21వ శతాబ్దిలో వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి రంగంలోనే ఉత్తమ నాయకత్వం అవసరమని, అది కేవలం రాజకీయాలకే పరిమిత కారాదని అన్నారు.
ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్లో అమీర్కు అధికారిక స్వాగతం లభిస్తుంది.