Home » Samajwadi Party
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి షాకిచ్చారు.
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్ ను సమాజ్వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోంది.
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీపై సమాజ్వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.