Home » TG News
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్రావు విమర్శించారు.
వారిద్దరూ స్నేహితులు. కానీ.. ఓ చిన్న విషయంలో వచ్చిన తేడాతో చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నగరంలోని బోడుప్పల్ కళానగర్ కాలనీలో జిమ్ నిర్వాహకుడు సాయికిషోర్ను డంబెల్తో కొట్టిచంపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు ఇందుకు తగ్గట్టుగా ప్రతిఒక్క కార్యకర్త పనిచేయాలని సూచాంచారు.
ప్రస్తుత వేసవి, సెలవుల నేపధ్యంలో 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ఆయా ప్రాంతాలకు వీక్లీ రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అలాగే కేంద్రప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
మీరు తినే ఐస్క్రీమ్ ఏ ఫ్లేవరో చెబితే రూ. 3లక్షలు మీవే.. అంటూ ఓ కార్యక్రమం ఈనెల 27న ఐస్క్రీమ్ ప్రియుల ముందుకు రాబోతోంది. అయితే.. ఈ పోటీలో పాల్గొనే వారి కళ్లకు గంతలు కడతారు. కేవలం దాని రుచి ఆధారంగా అది ఏ ఫ్లేవరో చెప్పాలి అంటున్నారు నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళితే..
ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు మన ప్రభుత్వాసుపత్రి వైద్యులు. అమీర్పేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు ఓ గర్భిణికి అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి, శిశువును కాపాడారు. సమస్య తీవ్రతను గుర్తించి కేవలం 8 నిమిషాల్లో అత్యవసర శస్త్రచికిత్స చేసి ఔరా అనిపించుకున్నారు.
నగరంలో.. అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన బంజారాహిల్స్లో దాదాపు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు కబ్జాను అడ్డుకున్నారు. కబ్జాదారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు రానున్నాయి! ఇందులో విదేశీ బ్రాండ్లూ ఉండనున్నాయి. ఇందుకు మద్యం తయారీదారులు, సరఫరాదార్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ధూల్పేట్ అంటేనే నాటుసారా, గంజాయి తదితర వాటిని విక్రయించే ఏరియాగా రికార్డుల్లోకెక్కింది. అయితే.. దీన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహిస్తోంది. 250 రోజుల్లో 102 కేసులు నమోదు చేశారు.