సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.
మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పర్యటించారు. మార్కెట్ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్ కుమార్లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
చింతలమానేపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్టుషాపు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో పల్లెలు పట్టణాలని తేడాలేకుండా కిరాణా దుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాల వద్ద మద్యం ఏరులై పారుతోంది.
వాంకిడి, జనవరి 12: సక్రాంతి పర్వదినం సెలవులొచ్చాయంటే విద్యార్థులకు ఎంతో సంతోషం. ఎక్కడలేని ఆనందం.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహిం చారు.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): క్రీడాపోటీల్లో గెలుపు ఓటములు సహజమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.
కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.