హైదరాబాద్‌లో రెండు ఆస్పత్రులు సీజ్...

ABN , First Publish Date - 2021-04-02T17:50:40+05:30 IST

మరికొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు, డెంటల్‌ ఆస్పత్రులు, ఫిజియోథెరపి క్లినిక్‌లు..

హైదరాబాద్‌లో రెండు ఆస్పత్రులు సీజ్...

హైదరాబాద్/నిజాంపేట్‌ : నిజాంపేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడిస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు గురువారం సీజ్‌ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె.మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో రేష్మా క్లినిక్‌, నిజాం ఆస్పత్రిని మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని, అర్హతలేని వైద్యులతో చికిత్సలు చేయిస్తున్నారని, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరికొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు, డెంటల్‌ ఆస్పత్రులు, ఫిజియోథెరపి క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వాటిని కూడా వారం రోజుల్లో మూసి వేస్తామని ఆయన తెలిపారు. ఈ లోపు అనుమతులు లేని ఆస్పత్రులు వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-02T17:50:40+05:30 IST