వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2020-11-22T05:06:34+05:30 IST
వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

షాద్నగర్: శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఫరూఖ్నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు నేతృత్వంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. అంతకు ముందు స్వామివారి పల్లకిసేవ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సాయీశ్వర్రెడ్డి, వేముల బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.