‘గ్రూప్‌-1’కు 1,550 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2023-01-08T23:56:42+05:30 IST

జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షకు 1,550 మం ది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 19 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు.

 ‘గ్రూప్‌-1’కు 1,550 మంది గైర్హాజరు
అరసవల్లిలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

- పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

అరసవల్లి/ఎచ్చెర్ల, జనవరి 8: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షకు 1,550 మం ది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 19 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు. మొత్తం 5,600మంది అభ్యర్థులకుగాను ఉదయం 4,065 మంది, మధ్యాహ్నం 4,050 మంది హాజరైనట్లు చెప్పారు. ఉదయం 1,5 35 మంది, మధ్యాహ్నం 1,550 (వీరి లో 15మంది ఉదయం హాజర య్యారు) మంది గైర్హాజరైనట్లు తెలి పారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఏపీ పీఎస్సీ సెక్రటరీ హెచ్‌.అ రుణ్‌కు మార్‌(ఐఏఎస్‌), ఎచ్చెర్లలోని అంబే డ్కర్‌ యూనివర్సిటీ, వెంకటేశ్వర, శివానీ(చిలకపాలెం) ఇంజనీరింగ్‌ కళా శాలలు, అరసవల్లి రోడ్‌లోని కేశవరెడ్డి పాఠశాల పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ జీఆర్‌ రాధిక పరిశీలించారు. ఎటువంటి పొరపా ట్లకు తావులేకుండా పరీక్షలు సజావు గా జరిగేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ జె.శశికళ, అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరిం టెండెంట్‌ కేవీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T23:56:44+05:30 IST